Ys jagan : నేడు తిరుమలకు జగన్

‍ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమల వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్డు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ పిల్లల [more]

Update: 2021-10-11 01:30 GMT

‍ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమల వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్డు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ పిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరికి చేరుకుని నడకదారిని, పైకప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రానికి తిరుమల చేరుకుంటారు. బేడీ ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుంటారు. శ్రీవారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లను చేశారు.

Tags:    

Similar News