అంతటి గోప్యత ఎందుకని ప్రశ్నిస్తే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేటినీ ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల [more]

Update: 2021-08-17 02:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేటినీ ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఆన్ లైన్ పెడుతుండటం 2008 నుంచి సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరమైన విషయాలు బయటకు పొక్కుతుండటంతో పాటు, కొన్ని కీలక శాఖలకు సంబంధించి ముందుగానే తెలిసిపోతుండటంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. దీనిపై రచ్చ అయ్యే అవకాశముంది. ప్రజా ప్రభుత్వం లో గోప్యత ఎందుకన్న విపక్షాలు వేసే ప్రశ్నకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News