జగన్ గుడివాడలో గంటసేపు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుడివాడ రానున్నారు. గుడివాడలో జరిగే సంక్రాంతి సంబరాల్లో జగన్ పాల్గొననున్నారు. అక్కడ జరిగే ఎడ్లబండి పోటీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు [more]

Update: 2020-01-14 02:38 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుడివాడ రానున్నారు. గుడివాడలో జరిగే సంక్రాంతి సంబరాల్లో జగన్ పాల్గొననున్నారు. అక్కడ జరిగే ఎడ్లబండి పోటీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలను జగన్ తిలకించనున్నారు. ఒంగోలు జాతి ఎద్దులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గొర్రెలు, మేకల ప్రదర్శనను కూడా జగన్ చూడనున్నారు. గుడివాడలో దాదాపు గంటసేపు ఉంటారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జగన్ గుడివాడకు వస్తున్నారని, ఆయనకు స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నాని తెలిపారు.

Tags:    

Similar News