కలెక్టర్లదే బాధ్యత.. జగన్ ఆదేశం

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. [more]

Update: 2021-04-26 01:20 GMT

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడలో కలెక్టర్లదే కీలక పాత్ర అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో శానిటైజేషన్ చేయించాలని, ప్రజలు మాస్క్ లు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.

Tags:    

Similar News