జనంలోకి ఇక జగన్….!!

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష‌్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన [more]

Update: 2019-07-02 10:40 GMT

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష‌్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన స్పందన కార్యక్రమంపై సమీక్షించారు. ప్రజలు ఇచ్చిన వినతులకు ఎప్పుడు పరిష్కరించేది వెంటనే తెలియజేయాలని, వారికి రశీదులివ్వాలని కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని కోరారు. ప్రజలు ఇచ్చే వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. తాను ప్రతి మంగళవారం కలెక్టర్లతో అరగంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన కార్యక్రమంపై సమీక్షించనున్నట్లు తెలిపారు. అధికారులు సూచించినతేదీలోగా సమస్యలను పరిష్కరించలేకపోతే దానికి వివరణ వెంటనే అర్జీదారులకు తెలియజేయాలని కోరారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానని తెలిపారు. నేరుగా జనంలోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు.

Tags:    

Similar News