అమిత్ షా తో భేటీకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతరాష‌్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశంలో పాల్గన్నారు. అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సభ్యుడిగా [more]

Update: 2019-08-25 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతరాష‌్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశంలో పాల్గన్నారు. అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సభ్యుడిగా జగన్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జగన్ అమిత్ షాతో భేటీకానున్నట్లు తెలిసింది. పోలవరం రివర్స్ టెండర్లు తదితర అంశాలపై అమిత్ షా తో జగన్ చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పోలవరం రివర్స్ టెండర్లపై న్యాయనిపుణుల సూచనలు తీసుకోవాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News