బాబు ఓర్వలేకపోతున్నారు

కీలకమైన బిల్లులను ప్రవేశపెడుతున్న సమయంలో సభను అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశంపార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు [more]

Update: 2019-07-22 10:25 GMT

కీలకమైన బిల్లులను ప్రవేశపెడుతున్న సమయంలో సభను అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశంపార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును అడ్డుకోవాలని చూస్తుందని జగన్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తుంటే చంద్రబాబునాయుడు ఓర్వేలేకపోతున్నారన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలను ఇవ్వాలని ప్రవేశపెట్టిన బిల్లును కూడా టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. స్పీకర్ పై టీడీపీ దాడికి ప్రయత్నించడం అమానుషమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.

Tags:    

Similar News