చంద్రబాబు, జేసీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

నిత్యం అన్నివర్గాల ప్రజల్లో మమేకమయ్యే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కులాన్ని ఆపాదించడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో [more]

Update: 2018-12-28 07:17 GMT

నిత్యం అన్నివర్గాల ప్రజల్లో మమేకమయ్యే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కులాన్ని ఆపాదించడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత ఆధునిక యుగంలో ఇంకా కులంతో లబ్ధిపొందాలని చూస్తున్న నాయకుడు చంద్రబాబు తప్ప ఎవరూ లేరన్నారు. అందరి కంటే ఎక్కువ బహిరంగ సభల్లో మాట్లాడిన జగన్ ఒక్కరోజైనా కులం గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి… కనీస సంస్కారం లేకుండా జగన్ ను ‘ఒరేయ్’ అంటూ మాట్లాడితే చంద్రబాబు నవ్వుతున్నారని, అవే మాటలు వీరిని అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒక కులం వారిని అదే కులం వారితో తిట్టించడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేనన్నారు. ఇలానే చంద్రబాబు ఆరోపించిన మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైందో రేపు దివాకర్ రెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు.

తాపీ మెస్త్రీని హెలీకాఫ్టర్ లో ఎక్కించుకుని…

ఎన్నికలు మూడు నెలల్లో వస్తున్నాయనగా శంకుస్థాపనల పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియా మద్దతు ఉంది కదా అని ప్రజలను ఏమార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ ను కమీషన్ల కోసమే చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. కేవలం బినామీల భూముల ధరలు పెంచుకోవడానికే స్టీల్ ప్లాంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రపంచంలోనే పెద్ద బిల్డింగులు కడతాననే చంద్రబాబు ఐదేళ్లలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించలేదన్నారు. చంద్రబాబు ప్రచారయావ అందరికీ తెలుసని, గతంతో ఆయన పదవీకాలం చివర్లో దేవాదుల ప్రాజెక్టుకు పునాదిరాయి వేసేందుకు తాపీ మేస్త్రీని హెలీకాఫ్టర్ లో ఎక్కించుకుని వెళ్లి చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News