తిరుపతిలో వైసీపీని ఓడిస్తేనే మనుగడ

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేకపోయింది వైసీపీ అరాచాలవల్లనేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2021-03-22 01:51 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేకపోయింది వైసీపీ అరాచాలవల్లనేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్క చాన్స్ అంటూ వచ్చి దోచుకుంటున్నారని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ తాను ఉన్నట్లుగా అందరూ జైల్లో ఉండాలని భావిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ద్వారా వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News