ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో కోరారు. జగన్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాను పబ్లిక్ పాలసీలమీదనే రాజకీయ ప్రసంగాల్లో మాట్లాడతానని పవన్ చెప్పారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని, రాజకీయాల్లో వాడనని పవన్ చెప్పారు. ఇప్పటితో ఈ వివాదాన్ని ముగించాలని పవన్ తన అభిమానులతో పాటు రాజకీయ పార్టీలనూ కోరారు.