ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసే వారికి ఆర్బీఐ హెచ్చరిక

ఈ రోజుల్లో సాంకేతికత పెరిగిపోయింది. అందుకు తగినట్లుగానే మోసాలు కూడా జరుగుతున్నాయి..

Update: 2023-08-15 10:45 GMT

ఈ రోజుల్లో సాంకేతికత పెరిగిపోయింది. అందుకు తగినట్లుగానే మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకు ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. బ్యాంకులకు వెళ్లి డబ్బులు చేసినా, ఏటీఎంలకు వెళ్లి డ్రా చేసినా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది. ఇక అసలు విషయానికొస్తే ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం గురించి. ఏటీఎంలలో డబ్బులు ఉపసంహరించుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. అలాంటి వారి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటపుడు చాలా సార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దీని వలన మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

ఏటీఎం భద్రతా చిట్కాలు ఏమిటి?

మారుతున్న కాలంతో పాటు, ఏటీఎం వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకులకు వెళ్లే బదులు ఏటీఎం కార్డు నుంచి నగదు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఒకప్పుడు ఏటీఎంల వద్ద క్యూలైన్ లో ఉండి డబ్బులు డ్రా చేసుకునేవారు. కానీ టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కువగా ఆన్ లైన్ లావాదేవీలే చేస్తున్నారు. అయినా ఇంకా చాలా మంది కూడా ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేస్తుంటారు.

ఈరోజుల్లో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి మోసగాళ్లు కూడా పెరిగిపోతున్నట్లు ఆర్బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏటీఎం మోసాల నుండి కస్టమర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్‌బీఐ కొన్ని భద్రతా చిట్కాలను సూచించింది.

ఏటీఎం పిన్ విషయంలో జాగ్రత్త:

మీ ఏటీఎం పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు. దీనితో పాటు, ఎక్కడైనా రాసి కూడా సేవ్‌ చేసుకోవద్దు. మొబైల్‌లో కూడా ఏటీఎం పిన్‌లను సేవ్‌ చేసుకోవద్దు. అలాగే ఈమెయిల్ కు పంపుకోవడం, పిన్ గుర్తించుకునేందుకు మీ ఇంట్లో ఉన్న వారి వాట్సాప్ నంబర్ కు పంపుకోవడం చేయవద్దు. ఏటీఎం మెషీన్‌లో పిన్‌ను నమోదు చేసేటప్పుడు, మీ చేతులతో పిన్‌ కీప్యాడ్‌ను కవర్ చేసేలా ఉండాలి. ఎందుకంటే పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఎవ్వరికి కనిపించకుండా ఉంటుంది. డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని వ్యక్తుల సహాయం తీసుకోకండి. దీని వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, నగదు ఉపసంహరణ తర్వాత మీరు తప్పనిసరిగా క్యాన్సిల్‌ బటన్‌ను నొక్కాలి. విత్‌డ్రా ప్రాసెస్‌ అయిన తర్వాత డబ్బులు, ఏటీఎం కార్డును తీసుకోవడం మర్చిపోవద్దు.

కార్డు చిక్కుకుపోతే..

మీ ఏటీఎం మెషీన్‌లో కార్డ్ చిక్కుకుపోయినట్లయితే వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేసి దాని గురించి వెంటనే తెలియజేయడం చాలా ముఖ్యం. నగదు బయటకు రాకపోయినా, మీరు దాని గురించి బ్యాంకుకు తెలియజేయవచ్చు. ఏటీఎంలో డబ్బులు తీసుకునే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడి అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయి ఏటీఎంలో డబ్బులు రాకపోతే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సమస్య తలెత్తితో ఒక రోజులో డబ్బులు మీబ్యాంకు అకౌంట్‌కు మళ్లీ బదిలీ అవుతాయి. అయినా ముందస్తుగా బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని గుర్తించుకోండి.

ఇతర వ్యక్తులను డబ్బులు డ్రా చేయించడం:

మీరు ఏటీఎం వద్దకు వచ్చిన తర్వాత పొరపాటున ఇతర వ్యక్తులతో డబ్బులు డ్రా చేయించుకోవద్దు. మీకు తెలియపోతే మీ ఇంట్లో వ్యక్తులను వెంట తీసుకెళ్లాలి తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

Tags:    

Similar News