రాష్ట్రాన్ని దివాలా తీయించి.. నీతులు చెబుతారా..?

ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీఇన్నీ కావదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ గెలిస్తే భూములు లాక్కుంటారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని, రౌడీలు కత్తులు [more]

Update: 2019-04-29 13:33 GMT

ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీఇన్నీ కావదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ గెలిస్తే భూములు లాక్కుంటారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని, రౌడీలు కత్తులు పట్టుకొని తిరుగుతారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంతలా దిగజారడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. స్వైన్ ఫ్లూ వైరస్ మాదిరిగా చంద్రబాబు వైరస్ ను వ్యాప్తి చేస్తే గుంపులో కుటుంబరావు ఒకరని పేర్కొన్నారు. అవినీతి, అక్రమార్జనే ఆక్సీజన్ గా బతికారని ఆరోపించారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలక నీతులు వల్లిస్తారా అని ప్రశ్నించారు. మే 23 తర్వాత వాళ్ల బతుకులు రోడ్డున పడతాయని, మేసిందతా వడ్డీతో సహా కక్కాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.

Tags:    

Similar News