వారికి విజయసాయి వార్నింగ్

తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు వాస్తవం కాదని, ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తాను ప్రజాసేవ కోసమే వచ్చానని, భూ ఆక్రమణల [more]

Update: 2021-09-02 06:38 GMT

తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు వాస్తవం కాదని, ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తాను ప్రజాసేవ కోసమే వచ్చానని, భూ ఆక్రమణల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. తన పేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనకు విశాఖలో భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచన కూడా లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని తెలిపారు. తనను ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బాధ్యతలను చూసుకోమంటే చూస్తున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు విశాఖలో ఒక్క సెంటు భూమి కూడా లేదన్నారు.

Tags:    

Similar News