లత చెప్పిన సంచలన విషయాలు

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. విజయా రెడ్డి తీరు వల్లనే ఇది మొత్తం జరిగిందని నిందితుడి భార్య లత ఆరోపిస్తున్నారు. తమ [more]

Update: 2019-11-08 11:03 GMT

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. విజయా రెడ్డి తీరు వల్లనే ఇది మొత్తం జరిగిందని నిందితుడి భార్య లత ఆరోపిస్తున్నారు. తమ ల్యాండ్స్ విషయంలో విజయా రెడ్డి ప్రవర్తన సరిగా లేదపి ,ఇందువల్లనే తన భర్త సురేష్ ఆమె పై పగ పెంచుకున్నాడని తెలిపింది. విజయా రెడ్డిని భయపెట్టి తమ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాడని. దురదృష్టవశాత్తూ, మంటల్లో ఇద్దరు చనిపొయారని లత ఆవేదన వ్యక్తం చేశారు.

9 లక్షలు లంచం ఇచ్చి….

ఎమ్మార్వో విజయా రెడ్డి వేధింపుల కారణంగానే తన భర్త చనిపొయాడని తెలిపింది. విజయా రెడ్డి హత్య కు గురి కావడం తనకు కూడా బాధ కలిగించిందని చెప్పింది. తాను కూడా నా భర్త ను కొల్పాయానని ఆవేదన చెందింది. తన భర్త విజయా రెడ్డి పై దాడి చేయాలని వెళ్లలేదని తనతో చెప్పినట్లు లత వెల్లడించింది. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సమయంలో తనో సురేష్ మాట్లాడాడని. ఈ సందర్బంలో చాలా విషయాలు చెప్పాడని లత అంటుంది. ఆత్మహత్యా యత్నం చేసి విజయారెడ్డి ని భయపెట్టాలనుకున్నాడని తెలిపింది. అప్పటికి మాట వినక పోవడం తో విజయ రెడ్డిని చంపాడని లత చెబుతుంది. ఇప్పటికే అప్పు చేసి తన భర్త 9 లక్షలు లంచాల రూపంలో అధికారులకు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే ఈ డబ్బులు ఎవరికి ఇచ్చాడో తమకు తెలియదని పేర్కొంది. ఇంకా డబ్బులు కావాలని అడిగాడని, ఇల్లు అమ్మి తమ భూమి వ్యవహారంను సెటిల్ మెంట్ చేసుకుంటామని అన్నాడని తెలిపింది.

Tags:    

Similar News