వసంత బయలుదేరారు....!

Update: 2018-05-10 03:18 GMT

వైసీపీలో చేరేందుకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తన అనుచరులతో కలిసి తన స్వగ్రామమైన ఐతవరం నుంచి వందల సంఖ్యలో వాహనాలతో బయలుదేరిన కృష్ణ ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన సమక్షంలో మరి కాసేపట్లో వసంత వైసీపీలో చేరనున్నారు.

Similar News