సారూ.. ఇక గడ్డం గీయండి!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకూ తాను గడ్డం గీయనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శపథం చేశారు. 2016లో ఆయన అన్యాపదేశంగా ఈ మాట అన్నారు. కానీ మాటకు కట్టుబడ్డారు. 2018 ఎన్నికల్లో హస్తం దెబ్బతిన్నా.. ఆయన మాత్రం మాట తప్పలేదు. ఆ గడ్డాన్ని మెంటైన్‌ చేస్తూ వచ్చారు.

Update: 2023-12-03 05:39 GMT

ఎనిమిదేళ్ల శపథానికి మోక్షం!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకూ తాను గడ్డం గీయనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శపథం చేశారు. 2016లో ఆయన అన్యాపదేశంగా ఈ మాట అన్నారు. కానీ మాటకు కట్టుబడ్డారు. 2018 ఎన్నికల్లో హస్తం దెబ్బతిన్నా.. ఆయన మాత్రం మాట తప్పలేదు. ఆ గడ్డాన్ని మెంటైన్‌ చేస్తూ వచ్చారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుండటంతో ఉత్తమ్‌ గడ్డానికి మోక్షం లభించినట్లే. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే గడ్డం తీసేస్తానని ఆయన చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ శపథం ఫలిస్తోంది. ఈ పరిణామం భారాస నేతల్ని ఖచ్చితంగా ఇరుకున పెడుతుంది.

ఇలాంటి పరిస్థితే గతంలో చంద్రబాబుకు ఎదురైంది. ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత లక్ష్మీపార్వతి దివంగత ఎన్టీయార్‌ చితాభస్మాన్ని గంగా నదిలో కలిపారు. ఇది ఆ తెలుగుదేశం నేతల్ని ఇబ్బంది పెట్టింది. ఇలా కొన్ని శపథాలు... సాధించిన తర్వాత మాంచి కిక్‌ ఇస్తాయి,

Tags:    

Similar News