ఓటమికి కారణం ఆయన కాదు

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పొత్తులు కారణం కాదని, చంద్రబాబు ప్రచారం వల్ల నష్టమేమీ జరగలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం [more]

Update: 2018-12-28 10:14 GMT

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పొత్తులు కారణం కాదని, చంద్రబాబు ప్రచారం వల్ల నష్టమేమీ జరగలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఓటమిపై ఇప్పటికే ఏఐసీసీకి ప్రాథమిక నివేదికను ఇచ్చానట్లు తెలిపారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామన్నారు. ఓటమిపై సమీక్ష నిర్వహిస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News