కాలు పెట్టారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు చేరుకున్నారు. ఆయన అహ్మదాబాద్ లోని విమానాశ్రయంలో దిగిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. మోదీ [more]

Update: 2020-02-24 06:37 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు చేరుకున్నారు. ఆయన అహ్మదాబాద్ లోని విమానాశ్రయంలో దిగిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. మోదీ ఆలింగనం చేసుకుని ట్రంప్ కు స్వాగతం చెప్పారు. ట్రంప్ కు భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి ట్రంప్ నేరుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. దారిపొడుగునా ట్రంప్ కు స్వాగతం పలికేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ తో పాటు భార్య మెలీనియా కూడా వచ్చారు.

Tags:    

Similar News