ఇంట్లో కూర్చుంటే ఎలా.. భవిష్యత్ కోసం బయటకు రండి

దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తేనే ఆగుతాయని [more]

Update: 2021-03-23 01:02 GMT

దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తేనే ఆగుతాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన జరుగుతున్న బంద్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ బంద్ కు అందరూ సహకరించి ప్రజల ఆస్తులను కాపాడుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News