ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరం

టీడీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ [more]

Update: 2020-06-19 12:25 GMT

టీడీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతునారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరినా అనుమతి లభించలేదు. దీంతో అచ్చెన్నాయుడు రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన లేదు. ఇక మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటింగ్ కు హాజరు కాలేదు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు కు లేఖ రాశారు. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని వ్యాపారనిమిత్తం కలిశానని, ఆయనకు కరోనా సోకిందని, అందువల్లనే తాను రాజ్యసభ ఎన్నికలకు రాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News