ట్రిపుల్ తలాక్ కు ఓకే

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం లభించింది. కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీలు ట్రిపుల్ తలాక్ బిల్లును నిరసిస్తూ వాకౌట్ చేశాయి. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు [more]

Update: 2019-07-25 14:10 GMT

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం లభించింది. కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీలు ట్రిపుల్ తలాక్ బిల్లును నిరసిస్తూ వాకౌట్ చేశాయి. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు 303 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న మోదీ ప్రభుత్వం ఆలోచన ఆచరణ రూపం దాల్చింది. కొన్ని ముస్లిం వర్గాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా ముస్లిం మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Tags:    

Similar News