ట్రైనింగ్ ఐపీఎస్ సస్పెన్షన్

తనని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డి పై భార్య భావన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డి పై విచారణ [more]

Update: 2019-12-14 14:27 GMT

తనని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డి పై భార్య భావన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డి పై విచారణ చేసిన కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశారన్న భావన ఫిర్యాదు తో కీసర పోలీసులు మహేశ్వరరెడ్డి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ చేశారు. ఏడాదిన్నర క్రితం మహేశ్వర్ రెడ్డి , భావన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కీసర రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక….

ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక తనను మోసం చేసాడని వేరే పెళ్లికి సిద్ధం అవుతున్నాడని భావన తన ఫిర్యాదులో పేర్కొంది. ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత ఎక్కువ కట్నం వస్తుందన్న కారణంతో మొహం చాటేస్తున్నాడని భర్త పై ఆరోపణలు చేసింది. విడాకులు ఇవ్వాలంటూ మహేష్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడంటూ భావన ఆరోపణ చేసింది. మహేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులకు కేంద్ర హోం శాఖ కి భావన ఫిర్యాదు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రైనింగ్ నుంచి సస్పెన్షన్ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News