ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే పై ఆంధ్ర స్పైస్ హోటల్ కు కొద్ది దూరంలో ఆగిఉన్న లారీని

Update: 2023-08-20 17:12 GMT

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే పై ఆంధ్ర స్పైస్ హోటల్ కు కొద్ది దూరంలో ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో మృగ్గురు మృతి చెందారు. కొండెటి కృష్ణ అతని కుమారుడు స్పాట్ లోనే మృతి చెందగా అతరి భార్య కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కూతురు , అత్త ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్దితి విషమంగా ఉందని తెలుస్తోంది. కడప జిల్లా చెన్నూరు సమీపంలో ఈరోజు సుమారు 12.45 గంటలకు సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

స్దానికుల చెప్పిన దాని ప్రకారం లారీ డ్రైవర్ హైవేపై భోజనానికి ఆపిన సమయంలో కడప వైపునుంచి వస్తున్న కారు షడన్ గా అతివేగంతో వచ్చి ఆగిఉన్న లారీని ఢీకొట్టిందని. కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్దు అయు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, ఆయన వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ అక్కడి కక్కడే స్పాట్ లో చనిపోగా డ్రావర్ పక్కసీట్లో కూర్చున్న మహిళ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మద్యలో చనిపోయిందని స్దానికులు చెప్పారు. వీరి వద్ద చైతన్యా కాళాశాలకు చెందిని విజిటర్ పాస్ లు , వారి ఆధార్ కార్డులు లభించడంతో వాటి ఆధారంగా వీరంతా ఖైరతా బాద్ వారిగా పోలీసులు గుర్తించారు .

Tags:    

Similar News