బెజవాడలో కాల్పులు.. ఒకరి మృతి

విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ ను కాల్చి చంపారు. విజయవాడ బైపాస్ రోడ్ లో ఈ సంఘటన [more]

Update: 2020-10-11 02:22 GMT

విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ ను కాల్చి చంపారు. విజయవాడ బైపాస్ రోడ్ లో ఈ సంఘటన జరిగింది. దుండగులు మహేష్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో హరి అనే మరో యువకుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక పథకం ప్రకారం మహేష్ ను దుండగులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News