తిరుమలకు కర్ఫ్యూ ఎఫెక్ట్.. తగ్గిన భక్తుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ప్రభావం తిరుమల పై పడింది. తిరుమల కొండకు భక్తుల రాక తగ్గింది. సర్వదర్శనం టోకెన్లను కూడా టీటీడీ నిలపివేసింది. ఆన్ లైన్ లో [more]

Update: 2021-05-06 00:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ప్రభావం తిరుమల పై పడింది. తిరుమల కొండకు భక్తుల రాక తగ్గింది. సర్వదర్శనం టోకెన్లను కూడా టీటీడీ నిలపివేసింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతించింది. ఏప్రిల్ నెల నుంచే తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఒక్క ఏప్రిల్ నెలలో కేవలం 9 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగువేల మంది కూడా రావడం లేదు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ తరుపతి నుంచి తిరుమలకు బస్సులను అనుమతిస్తున్నారు. కిటకిటలాడుతుండే తిరుమల బోసిపోతున్నట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News