లాస్ట్ ట్రయల్స్

కర్ణాటక సంక్షోభం నుంచి బయట పడేందుకు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు తమ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని మాజీ ముఖ్యమంత్రి, [more]

Update: 2019-07-21 03:39 GMT

కర్ణాటక సంక్షోభం నుంచి బయట పడేందుకు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు తమ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అందరికీ ఆదేశాలు అందాయి. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీఎల్పీ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరుకాకుంటే చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య హెచ్చరిస్తున్నారు. రేపు కర్ణాటక శాసనసభలో కుమారస్వామి బలపరీక్ష జరగనుండటంతో తమ చివరి ప్రయత్నంగా సీఎల్పీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News