జగన్ సర్కార్ కు చెంపదెబ్బే

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అధికారిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికల [more]

Update: 2020-03-18 06:56 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అధికారిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికల అధికారి విధి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని తెలిపారు. ఈ తీర్పు తాము ఊహించిందేనని యనమల అన్నారు. కరోనా కారణంగానే ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి చెప్పినా జగన్ ప్రభుత్వం మొండిగా వెళ్లిందని యనమల రామకృష్ణుడు అన్నారు.

Tags:    

Similar News