మహేష్ బాబుకు చంద్రబాబు పరామర్శ

సూపర్ స్టార్ కృష్ణ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని ప్రకటించారు

Update: 2022-11-15 08:14 GMT

సూపర్ స్టార్ కృష్ణ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని ప్రకటించారు. నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి చేరుకుని పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహేష్ బాబు పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. కృష్ణ అనారోగ్యం పాలవ్వడం, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

నేతలు.. హీరోలు...
కృష్ణ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక లెజండ్ అని చంద్రబాబు అన్నారు. ఏం చేయాలన్నా ధైర్యంగా చేయడం ఒక్క ఆయనకే చెల్లిందన్నారు. కృష్ణ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపాన్ని ప్రకటించారు. కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కృష్ణ భౌతిక కాయానికి సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, వెంకటేష్ నాగచైతన్య వంటి వారు వచ్చి మహేష్ బాబును ఓదార్చారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News