లాక్ డౌన్ పై నేడు మంత్రుల బృందం

నేడు కేంద్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. లాక్ డౌన్ ను కొనసాగింపు, మినహాయింపులపై మంత్రుల బృందం చర్చించనుంది. మే 17వ తేదీతో మూడో విడత లాక్ [more]

Update: 2020-05-15 03:32 GMT

నేడు కేంద్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. లాక్ డౌన్ ను కొనసాగింపు, మినహాయింపులపై మంత్రుల బృందం చర్చించనుంది. మే 17వ తేదీతో మూడో విడత లాక్ డౌన్ ముగియనుంది. నాలుగో విడత లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెప్పారు. అయితే సడలింపులు నాలుగో విడత లాక్ డౌన్ లో అధికంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాక్ డౌన్ పై నివేదికలు అందాయి. వీటిని పరిశీలించి మంత్రుల బృందం ఒక నిర్ణయానికి రానుంది. ప్రధానికి నివేదిక సమర్పించనుంది.

Tags:    

Similar News