వివేకా హత్య కేసులో బీటెక్ రవి?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. కడపలోని హరిత హోటల్ లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి కలసి బేటీ అయ్యారన్న [more]

Update: 2020-01-02 06:46 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. కడపలోని హరిత హోటల్ లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి కలసి బేటీ అయ్యారన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. మార్చి 14వతేదీన కడపలోని హరిత హోటల్ లోని 102లో వీరిద్దరూ సమావేశమై దేనిపై చర్చించారన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరు సమావేశానికి గల కారణాలేంటి? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా హరిత హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ ను సిట్ అధికారiలు కోరారు. హోటల్ రికార్డుల్లోనూ వీరిద్దరి పేర్లు నమోదు కాలేదు. అదే రోజు పరమేశ్వరరెడ్డి తిరుపతి రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే తమ హోటల్ లో సీసీ కెమెరాలు లేవని హోటల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బీటెక్ రవి ప్రమేయం ఉందా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు

Tags:    

Similar News