ప్రెస్ మీట్ కి ముందు లగడపాటితో టీడీపీ నేత భేటీ

ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి అంచనాలు పూర్తిగా తప్పిన నేపథ్యంలో ఇప్పుడు [more]

Update: 2019-05-18 12:33 GMT

ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి అంచనాలు పూర్తిగా తప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. అయితే, ప్రెస్ మీట్ కి ముందు లగడపాటి రాజగోపాల్ ను తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. సుమారు అరగంట పాటి లగడపాటి రాజగోపాల్ తో బుద్దా వెంకన్న చర్చలు జరిపారు. ఇటీవల లగడపాటి రాజగోపాల్ టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు రాత్రివేళ సీక్రెట్ గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో కలిసి లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో లగడపాటి కచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఫలితాలు చెబుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News