ఎక్కడికక్కడ అరెస్ట్ లతో…?

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ, జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారిని గృహనిర్భంధంలోనే ఉంచుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత సేపు వారు బయటకు రాకూడదని పోలీసులు [more]

Update: 2020-01-20 02:18 GMT

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ, జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారిని గృహనిర్భంధంలోనే ఉంచుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత సేపు వారు బయటకు రాకూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జేఏసీ, టీడీపీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అమరావతి గ్రామాల్లో పెద్దయెత్తున పోలీసు బలగాలు మొహరించాయి. కొత్త వ్యక్తులను ఎవరినీ గ్రామాల్లోకి అనుమతించడం లేదు. అలాగే సచివాలయం వద్ద మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. నేడు అసెంబ్లీలో రాజధాని అమరావతిపై కీలక నిర్ణయం తీసుకోనుండటంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు

Tags:    

Similar News