జగన్…..పులివెందుల రాజ్యంకాదు

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది. గుంటూరులో చేపట్టిన ధర్నాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. [more]

Update: 2019-10-30 07:03 GMT

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది. గుంటూరులో చేపట్టిన ధర్నాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. గుంటూరు పాత బస్టాండ్‌ వద్ద మూసేసిన అన్న క్యాంటీన్‌ వద్ద ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. గృహనిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేశ్‌కు వివరించారు. పేదల రాజ్యాన్ని పులివెందుల భోజ్యంగా మార్చారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. నారా లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదల రాజ్యం పులివెందుల రాజ్యంలా మారుతుందంటూ విమర్శించారు. నారాలోకేష్ ధర్నా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగనుంది.

 

Tags:    

Similar News