వైసీపీ నేతలున్నా డోన్ట్ కేర్.. అధికారులకు తమ్మినేని ఆదేశాలు

స్పీకర్ తమ్మినేని సీతారాం పొందూరు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను [more]

Update: 2020-06-06 08:38 GMT

స్పీకర్ తమ్మినేని సీతారాం పొందూరు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమ్మినేని ఆదేశించారు. పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలను తీసుకోకుంటే చర్యలు తప్పవని తమ్మినేని సీతారాం హెచ్చరించారు. అయితే వైసీపీ నేతలు కూడా ఆక్రమణదారుల్లో ఉన్నారని కొందరు అధికారులు ఆయన దృష్టికి తేగా, ఎవరున్నా సరే పొందూరులో ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వైసీపీ నేతలకు తాను చెబుతానని, ఆక్రమణలను తొలగించాల్సిందేనని తమ్మినేని సీతారాం కోరారు.

Tags:    

Similar News