అమరావతిని అంగుళం కదిలించినా…?

రాజధానిని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హెచ్చరించారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన హాస్యాస్పదమన్నారు. పది రోజుల నుంచి [more]

Update: 2019-12-29 04:45 GMT

రాజధానిని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హెచ్చరించారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన హాస్యాస్పదమన్నారు. పది రోజుల నుంచి రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. సమస్యకు ఫుల్ స్టాప్ పడే వరకూ ఆందోళన కొనసాగించాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకే రైతులు భూములిచ్చారన్నారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న ప్రభుత్వం ఏడు నెలల నుంచి ఏమీ తేల్చలేకపోయిందన్నారు. అమరావతిని ఒక్క అంగుళం కదలించినా ఊరుకునేది లేదని సుజనా చౌదరి తెలిపారు. తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు.

Tags:    

Similar News