బ్రేకింగ్ : ఏపీలో కొత్తగా ఈరోజు.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు యాభై కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1980కు [more]

Update: 2020-05-10 05:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు యాభై కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1980కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 925 మంది కాగా, యాక్టివ్ కేసులు 1010 వరకూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా నమోదయిన యాభై కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా వైరస్ తో ఏపీలో 45 మంది మృతి చెందారు.

Tags:    

Similar News