ఆదికి ఫైనల్ నోటీసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల ఎదుట హాజరు కాలేదు. ఇప్పటికి సిట్ అధికారులు ఆదినారాయణరెడ్డికి మూడు సార్లు నోటీసులు [more]

Update: 2019-12-10 11:27 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల ఎదుట హాజరు కాలేదు. ఇప్పటికి సిట్ అధికారులు ఆదినారాయణరెడ్డికి మూడు సార్లు నోటీసులు పంపినా హాజరు కాలేదు. ఆదినారాయణరెడ్డి ఆయన స్వగ్రామమైన దేవగుడిలోనూ అందుబాటులో లేరు. దీంతో సిట్ అధికారులు ఫైనల్ గా మరో నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. రేపటి విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరుకాకుంటే ఆయనపై కేసు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆదినారాయణరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత ఎక్కువగా ఢిల్లీ, బెంగళూరులోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. రేపు ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకాకుంటే కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News