ట్రైన్ లో పాము కలకలం

Update: 2018-08-02 11:56 GMT

ముంబై లోకల్ ట్రన్ లో ఓ పాము ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. టిట్వాలా - సీఎస్ఎంటీ మధ్య నడిచే లోకల్ ట్రైన్ థానే సమీపంలోకి రాగానే ట్రైన్ లోని సీలింగ్ ఫ్యాన్ నుంచి ఓ పసిరిక పాము వేలాడుతూ కనిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అప్పటికే ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. దీంతో చెయిన్ లాగి రైలును నిలిపివేశారు. దాదాపు మూడడుగులు ఉన్న ఈ పాము సిబ్బంది పట్టుకున్నారు. అయితే, అప్పటికే ఆ ట్రైన్ ఉదయం నుంచి రెండు ట్రిప్ లు తిరిగాక, మూడో ట్రిప్ లో కనిపించడం పట్ల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ధర్యాప్తం చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ పాము వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Similar News