రాజధాని భూములపై సిట్ విచారణ..మరో డిప్యూటీ కలెక్టర్ ను?

రాజధాని అమరావతి భూ వివాదాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ ను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు మరింత మందిని విచారిస్తున్నారు. [more]

Update: 2020-06-07 06:39 GMT

రాజధాని అమరావతి భూ వివాదాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ ను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు మరింత మందిని విచారిస్తున్నారు. మెట్ట భూములను జరీబు భూములుగా మార్చి కొందరికి సహకరించారన్న ఆరోపణలపై మరికొంత మంది డిప్యూటీ కలెక్టర్లను సిట్ పోలీసులు విచారిస్తున్నారు. మరో డిప్యూటీ కలెక్టర్ ను విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. రాజధాని భూములపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News