సానా లింకులు బయటపడుతున్నాయా…?

పారిశ్రామికవేత్త సానా సతీష్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సీబీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. రెండోరోజు విచారణలో సానా సతీష్ [more]

Update: 2019-07-30 06:09 GMT

పారిశ్రామికవేత్త సానా సతీష్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సీబీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. రెండోరోజు విచారణలో సానా సతీష్ కు వివిధ వ్యక్తులతో ఉన్న లింకులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాసం వ్యాపారి మొయిన్ ఖురేషీ, సానా సతీష్ తో జరిగిన మధ్య లావాదేవీలు భారీగానే జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇద్దరి మధ్య హవాలా సొమ్ముల లావాదేవీ జరిగినట్లు తమ విచారణలో తెలుసుకున్నారు. సానా సతీస్ బ్లాక్ బెర్రీ ఫోన్ ను కూడా తనిఖీ చేసిన అధికారులు వివిధ వ్యక్తులతో నెరిపిన లావాదేవీలపై నేడు విచారణ చేస్తున్నారు. సానా సతీష్ పెద్దయెత్తున పన్ను ఎగవేతకు కూడా పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News