బాబు బోగస్ పోల్స్.. ఫలితాలు ముందే లీక్

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరిట దొంగపోల్స్ పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి వెబ్ సైట్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరికి [more]

Update: 2020-08-26 02:39 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరిట దొంగపోల్స్ పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి వెబ్ సైట్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరికి తెలుసునన్నారు. చంద్రబాబు మీడియా, టీవీలు మాత్రమే పెట్టే పోల్స్ బోగస్ అని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గెలిచిన 23 నియోజకవర్గాల్లోనూ ఆయన పేరు చెబితేనే ప్రజలు మండి పడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 14 నెలలు మాత్రమే అయిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మర్చి పోయారని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమ ప్రభుత్వంపై చేస్తున్న అసత్యాలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

Tags:    

Similar News