అమరావతిలో త్వరలో మనోధైర్య యాత్ర చేస్తా

త్వరలో అమరావతిలో తాను మనోధైర్య యాత్ర చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు నాలుగైదు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత వస్తుందని [more]

Update: 2020-08-06 09:12 GMT

త్వరలో అమరావతిలో తాను మనోధైర్య యాత్ర చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు నాలుగైదు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత వస్తుందని చెప్పారు. అమరావతి రైతులను కుక్కలతో పోల్చడం దారుణమని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదే రైతులు వేటకుక్కలై వేటాడే సమయం తొందరలోనే ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అమరావతిపై పునరాలోచించుకోవాలని కోరారు. అమరావతి రైతులకు న్యాయం జరగుతుందని తనకు నమ్మకం ఉందన్నారు.

Tags:    

Similar News