Raghu : రఘురామ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదుపై స్పందన కన్పించింది. ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధమైన భవనాలకు కేటాయించడంపై కేంద్రం అభ్యంతరం [more]

Update: 2021-10-23 12:50 GMT

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదుపై స్పందన కన్పించింది. ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధమైన భవనాలకు కేటాయించడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఏపీలో ఎంపీ ల్యాడ్స్ ను కొందరు ఎంపీలు మతసంబంధమైన కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బాపట్లలో ఒక చర్చి నిర్మాణానికి 86 లక్షల ఎంపీ ల్యాడ్స్ ను ఖర్చు చేశారన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఏపీని వివరణ కోరింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది.

Tags:    

Similar News