ఏపీలో తెలంగాణ వారిని నియమిస్తావా జగన్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన [more]

Update: 2021-07-13 03:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ ఏపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను కూడా అమలు పర్చడం లేదన్నారు. దీనివల్ల విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు ఇబ్బందికరంగా మారిందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విదేశాలకు వెళ్లే యువతకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. వైద్య సంస్థల అధిపతులుగా తెలంగాణ వారిని నియమించడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. వారి స్థానంలో స్థానిక వైద్యులను నియమించాలని రఘురామ కృష్ణరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News