ఢిల్లీలో ఆగని రఘురామ పోరాటం

124 ఎ సెక్షన్ పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరుతున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీలకు కూడా రఘురామ [more]

Update: 2021-06-09 06:02 GMT

124 ఎ సెక్షన్ పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరుతున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీలకు కూడా రఘురామ కృష్ణంరాజు కోరారు. రానున్న వర్షాకాల సమావేశంలో ఈ సెక్షన్ పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం కేసులను తొలగించాలని, తన పోరాటానికి అందరూ మద్దతివ్వాలని రఘురామ కృష్ణంరాజు ఎంపీలకు రాసిన లేఖలో కోరారు. పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ సభ్యుడు శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కి రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఆయన తన పోరాటానికి మద్దతు తెలిపినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఈ మేరకు అనిల్ దేశాయ్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. రానున్న సమావేశాల్లో దీనిపై చర్చించాలని వెంకయ్యనాయుడును కోరారు.

Tags:    

Similar News