మోదీ మళ్లీ ఏం చెప్తారు?

ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానంగా కరోనా వైరస్, లాక్ డౌన్ లపైనే ఆయన ప్రసంగం కొనసాగనుంది. గతంలో లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని [more]

Update: 2020-05-02 02:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానంగా కరోనా వైరస్, లాక్ డౌన్ లపైనే ఆయన ప్రసంగం కొనసాగనుంది. గతంలో లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేశారు. ఈసారి దానికి భిన్నంగా కేంద్ర హోం శాఖ లాక్ డౌన్ ప్రకటనను చేసింది. అయితే మోదీ తన ప్రసంగంలో ఏం చెప్పనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మినహాయింపుల విషయంలోకూడా హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తూ ప్రధాని ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. అలాగే మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరనున్నారని భావిస్తున్నారు.

Tags:    

Similar News