నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ

నేడు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనా పరిస్థితులపై సమీక్షిస్తారు. లాక్ డౌన్ [more]

Update: 2020-06-16 02:40 GMT

నేడు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనా పరిస్థితులపై సమీక్షిస్తారు. లాక్ డౌన్ విధింపు, మినహాయింపుల తర్వాత పెరుగుతున్న కేసులపై మోదీ ముఖ్యమంత్రులతో చర్చిస్తారు. ప్రస్తుతం ఐదో విడత లాక్ డౌన్ అమలు జరుగుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరిస్తారు. లాక్ డౌన్ ను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై కూడా సీఎంల నుంచి అభిప్రాయలను మోదీ తెలుసుకుంటారు.

Tags:    

Similar News