బంధం మరింత బలపడుతుంది

ట్రంప్ భారత్ పర్యటనతో అమెరికా, ఇండియా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మొతేరా స్టేడియంలో మోదీ ప్రసంగించారు. హౌడీ మోడీ కార్యక్రమానికి కొనసాగింపే [more]

Update: 2020-02-24 08:30 GMT

ట్రంప్ భారత్ పర్యటనతో అమెరికా, ఇండియా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మొతేరా స్టేడియంలో మోదీ ప్రసంగించారు. హౌడీ మోడీ కార్యక్రమానికి కొనసాగింపే నమస్తే ట్రంప్ అని మోదీ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి ట్రంప్ చారిత్రాత్మక పర్యటనను ప్రారంభించారని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ట్రంప్ కుటుంబానికి స్వాగతం చెబుతుందన్నారు. అమెరికా-భారత్ సంబంధాలు గతం కంటే మరింత బలపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ – అమెరికా మధ్య ట్రంప్ పర్యటన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు.

Tags:    

Similar News