బ్రేకింగ్ : భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా… మరణాలు కూడా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 88,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,124 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-09-27 04:34 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 88,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,124 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,92,000 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 94,503 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9.60 లక్షలు లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 49 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News