బ్రేకింగ్ : రికవరీ రేటు బాగా పెరుగుతోంది

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 470మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-11-01 04:16 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 470మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,84,082 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,22,111 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,70 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 74.03 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News